నవతెలంగాణ-మల్హర్ రావు : ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో అన్ని చోట్లా ప్రత్యేకంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ప్రతి వాహనాన్ని పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అందులో భాగంగానే మండలంలోని కొయ్యూరు గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన చెక్ పోస్టువద్ద మంథని ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్ వాహనానంతోపాటు వెంట ఉన్న వాహనాలన్నింటిని పోలీసులు తనిఖీలు చేశారు. పోలీస్ అధికారులకు, సిబ్బందికి పుట్ట మధూకర్ సహకరించగా.వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు.పోలీసుల విధులకు ఎటువంటి ఆటంకం కలగకుండా జెడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ వాహనం పరిశీలనకు సహకరించారు. ఎన్నికల వేళ అక్రమ రవాణాను అడ్డుకోవడమే లక్ష్యంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన నేపథ్యంలో పోలీసుల పనితీరు పట్లపుట్ట మధూకర్ అభినందనలు తెలియచేసి ఇదే స్పూర్తితో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో, సజావుగా పూర్తయ్యేలా చూడాలని సూచించారు.