- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలు, సభాపతి వైఖరికి నిరసనగా సమావేశాల బహిష్కరించనున్నట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు తెలిపారు. రేపు తెలంగాణ భవన్లో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్లు చెప్పారు. అంతకుముందు అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. అనంతరం అసెంబ్లీ నుంచి గన్పార్క్కు వెళ్లి నిరసన తెలిపారు.
- Advertisement -



