పిఆర్డిఓ మండల అధ్యక్షుడు కొత్త నరసింహారెడ్డి
నవతెలంగాణ – నెల్లికుదురు
పి ఆర్ టి యు తోనే ఉపాధ్యాయ సంఘం సమస్యలు సత్వరమే పరిష్కారం అవుతాయని ఆ సంఘం మండల అధ్యక్షుడు కొత్త నరసింహారెడ్డి, ప్రధాన కార్యదర్శి గొట్టిముక్కుల శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఎంఈఓ రామదాసు చేతుల మీదుగా క్యాలెండర్ ఆవిష్కరిధ్య కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం పరిశీలిస్తుందని తక్షణమే ఉపాధ్యాయ సంఘం సమస్యలు ఏవి ఉన్న పరిష్కారం చేస్తుందని అన్నారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం చేసే వరకు టిఆర్టియు ముందు వరుసలో ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జిల్లా మండల నాయకులు లక్ష్మణ్, రామ్మోహన్ రెడ్డి, సోమయ్య, శ్రీనివాస్, జనార్ధన్, సిహెచ్ శ్రీనివాస్, ఫణీంద్ర, యాదగిరి, కుమార్, సంజీవయ్య, ఉపేందర్, తదితరులు పాల్గొన్నారు.
పీఆర్టీయూ తోనే ఉపాధ్యాయ సమస్యలు పరిష్కారం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



