- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలం అడ్వాలపల్లిలో బిఆర్ఎస్ పార్టీ 25వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సోమవారం బిఆర్ఎస్ జిల్లా యువజన నాయకుడు అజ్మీరా బాలాజీ నాయక్ ఆధ్వర్యంలో గ్రామ అధ్యక్షుడు అజ్మీరా శంకర్ నాయక్ చేతుల మీదగా గులాబి జెండా ఎగురవేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు స్వీట్లు పంచారు. ఈ కార్యక్రమంలో దుబ్బపేట సర్పంచ్ భూక్యా రవీందర్, ఉప సర్పంచ్ బానోత్ రాజేందర్, వార్డు సభ్యులు అజ్మీరా రాజు, తిరుమల రాణదేవ్, నాయకులు బాణోత్ సమ్మయ్య, అజ్మీరా దేవేందర్ ఇప్ప కృష్ణకర్, అజ్మీరా రాజు, కిషన్, పెరుమండ్ల లింగయ్య, జంగా రమేష్, అజ్మీరా తిరుపతి, రాజు, అనిల్,చంద్రశేఖర్ పాల్గొన్నారు.
- Advertisement -



