- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం వెల్జాల్ గ్రామ శివారులో ఎదురెదురుగా ఢీకొన్న రెండు కార్ల ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మే 3న చౌదర్పల్లిలో ఆంజనేయ స్వామి దేవాలయ ప్రారంభోత్సవం సందర్భంగా మేడారం యాత్రకు వెళ్లి తిరిగి వస్తున్న అంతారం, కొండేడు గ్రామాలకు చెందిన వారు వెల్జాల్ వద్దకు చేరుకున్నప్పుడు ఎదురుగా వచ్చిన కారు ఢీకొనడంతో ఈ ఘోరం జరిగింది. షిఫ్ట్ కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు మరణించగా, మరో నలుగురికి గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -



