నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా సీవీ ఆనంద్ పగ్గాలు చేపట్టిన తర్వాతి రోజే పోలీస్ శాఖలో ప్రక్షాళన పర్వం మొదలైంది. క్షేత్రస్థాయిలో శాంతిభద్రతలను మరింత కట్టుదిట్టం చేయడంతో పాటు, పారదర్శకమైన పాలనను అందించడమే లక్ష్యంగా భారీ బదిలీలకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ యంత్రాంగంలో మార్పులు చేర్పులు జరుగుతాయని భావిస్తున్న తరుణంలో, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో కీలక నిర్ణయం వెలువడింది. కమిషనరేట్ వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో పని చేస్తున్న 65 మంది సర్కిల్ ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ మేరకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేశ్ రెడ్డి ఈ బదిలీలకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులను జారీ చేశారు. గత కొంతకాలంగా ఒకే చోట విధులు నిర్వర్తిస్తున్న వారిని, పరిపాలనా సౌలభ్యం కోసం మరియు పనితీరు ఆధారంగా కొత్త ప్రాంతాలకు కేటాయించినట్లుగా తెలుస్తోంది.
సైబరాబాద్ కమిషనరేట్లో 65 మంది సీఐలు బదిలీ..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



