నవతెలంగాణ-హైదరాబాద్: పశ్చిమ బెంగాల్ బీజేపీ కీలక నేత సువేందు అధికారి పర్సనల్ అసిస్టెంట్(PA) చంద్రనాథ్ రథ్ దారుణ హత్యకు గురయ్యారు. కోల్కతా సమీపంలోని మధ్యమ్గ్రామ్ నియోజకవర్గంలో బుధవారం రాత్రి ఈ దాడి జరిగింది. చంద్రనాథ్ రథ్ తన కారులో వెళ్తుండగా, దుండగులు వెంబడించి కాల్పులు జరిపారు. నిందితులు నాలుగు రౌండ్లు కాల్పులు జరపగా, మూడు బుల్లెట్లు చంద్రనాథ్కు తగిలాయి. తీవ్ర గాయాలైన ఆయన్ను వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ దాడిలో ఆయనతో పాటు ఉన్న బుద్ధదేవ్ అనే మరో వ్యక్తి కూడా గాయపడటంతో ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చారిత్రాత్మక విజయం సాధించిన రెండు రోజులకే ఈ ఘటన జరగడం రాష్ట్రంలో కలకలం రేపుతోంది. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ హత్య జరిగిందని బీజేపీ శ్రేణులు మండిపడుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.
సువేందు అధికారి పీఏ దారుణ హత్య
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



