Saturday, May 9, 2026
E-PAPER
Homeసోపతిఈ విధ్వంసాన్ని ఆపండి,వారసత్వ సంపదను కాపాడండి

ఈ విధ్వంసాన్ని ఆపండి,వారసత్వ సంపదను కాపాడండి

- Advertisement -

ఈ విధ్వంసాన్ని నిలిపేసి, వారసత్వ సంపదను కాపాడండని కొత్త తెలంగాణ చరిత్రబృందం వినతి.800సం.ల కాకతీయులు నిర్మించిన ఈ శివాలయాన్ని కూల్చడానికి దినం పట్టకపోవచ్చు. కాని, కట్టడానికి యేండ్లు పడుతయి. ఆ ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ ఆవరణలో గుడి వుంటే దేనికి అడ్డంకి. అదొక వారసత్వనిర్మాణాన్ని ఉండనీయొచ్చుకదా. ఎవరిదీ పాపం? ఎందుకా గుడికి శాపం?? వరంగల్‌ జిల్లా ఖానాపూర్‌ మండలంలోని అశోక్‌నగర్‌ సమీపంలో కాకతీయుల నాటి ఆలయాన్ని కూల్చివేయబడ్డది. ప్రభుత్వం నిర్మించతలపెట్టిన ఇంటిగ్రెటేడ్‌ స్కూల్‌ ఆవరణలో ఉన్న రాష్ట్ర పురావస్తుశాఖ పరిధిలోని శివాలయాన్ని బుల్డోజర్‌తో కూల్చివేశారు. ఎవరి అండతో కాంట్రాక్టర్‌ ఇష్టానుసారంగా ఈ గుడిని నేలమట్టం చేశారని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పురావస్తు, దేవాదాయ శాఖల కనీస అనుమతి వుందో లేదో చెప్పేవారు లేరు.
శ్రీరామోజు హరగోపాల్‌, కన్వీనర్‌, కొత్త తెలంగాణ చరిత్రబృందం తరఫున

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -