నవతెలంగాణ-హైదరాబాద్: దేశంలో పెట్రోల్-డీజిల్ ధరలు పెరుగుతాయనే ఆందోళనల నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) సంజయ్ మల్హోత్రా కీలక వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రాచ్యంలో సంఘర్షణ కొనసాగితే, ప్రపంచ మార్కెట్లలో పెరుగుతున్న ముడి చమురు ధరల కారణంగా భారత్లో పెట్రోల్, డీజిల్ రేట్లను పెంచాల్సి రావచ్చని మల్హోత్రా అన్నారు. మంగళవారం స్విట్జర్లాండ్లో స్విస్ నేషనల్ బ్యాంక్ మరియు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంయుక్తంగా నిర్వహించిన ఒక సమావేశంలో మల్హోత్రా అన్నారు. దీనికి ఒక రోజు ముందు కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి కూడా ధరలు పెంచాల్సి రావచ్చని సూచించారు. పెరుగుతున్న ఇంధన ధరలు భారత్లో ద్రవ్యోల్బణాన్ని పరీక్షిస్తున్నాయని మల్హోత్రా చెప్పారు. ఇలాంటి సమయంలో రిజ్వ్ బ్యాంక్ విధానపరమైన జోక్యం చేసుకోవాల్సి వస్తుందని ఆర్బీఐ గవర్నర్ అన్నారు.
పెట్రోల్-డీజిల్ ధరలపై ఆర్బీఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



