- Advertisement -
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : పాలిసెట్ ఫలితాలలో శ్రీ సాయి ప్రశాంతి విద్యానికేతన్ హై స్కూల్ కు చెందిన విద్యార్థిని తోటకూర వైష్ణవి రాష్ట్రస్థాయిలో ఏం బైపిసి విభాగంలో 29వ ర్యాంకు, ఎంపీసీ విభాగంలో 75వ ర్యాంకు సాధించింది. మే 13 వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా 276 కేంద్రాలలో నిర్వహించిన ఈ ఎంట్రెన్స్ పరీక్షకు 98,858 మంది హాజరయ్యారు. కాగా తోటకూర వైష్ణవి రాష్ట్రస్థాయిలో 29 వ ర్యాంకు, అర్పిత్ యాదవ్ కు 570 వ ర్యాంకు సాధించడం పట్ల ఆ పాఠశాల ప్రిన్సిపాల్ తోటకూర యాదయ్య, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.
- Advertisement -