- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక విద్యా వారోత్సవాల్లో భాగంగా చివరి ఆదివారం మండల కేంద్రమైన తాడిచెర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యా విజయోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా2025-26 వార్షిక పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు ప్రిన్సిపల్ విజయ దేవి పర్యవేక్షణలో అధ్యాపకులు విద్యార్థులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో అధ్యాపకులు అధ్యాపకేతరులు,విద్యార్థులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
- Advertisement -



