- Advertisement -
నవతెలంగాణ-జుక్కల్: మండలంలోని డోన్గావ్ గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు సంతోష్ రిపబ్లిక్ డే సందర్భంగా డోన్గావ్-శక్తి నగర్ రెండు ప్రభుత్వ పాఠశాలలోని పేద విద్యార్థిని విద్యార్థులకు సొంత ఖర్చులతో టీ షర్ట్, మధ్యాహ్న భోజనానికి స్టీల్ ప్లేట్లు, అంగన్వాడి పిల్లలకు వాటర్ బాటిల్, అందించారు. మొత్తం పాఠశాల విద్యార్థులు పాఠశాల ప్రధానోపాధ్యాయులు అశోక్ వారి ఆధ్వర్యంలో.. గ్రామ పెద్దలు సర్పంచ్ కె. శ్రీనివాస్ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న సర్పంచ్ శ్రీనివాస్,పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు అశోక్ తో పాటు, ఉపాధ్యాయ బృందం,దాత సంతోష్,గ్రామ పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



