- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: కాకినాడ జిల్లా కత్తిపూడి సమీపంలోని రావికంపాడు జంక్షన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన లారీ ముందుగా ఉన్న కంటైనర్ను ఢీకొట్టడంతో భారీగా మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో కంటైనర్లో ఉన్న క్లీనర్ బయటకు రాలేక సజీవదహనం అయ్యాడు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ బయటకు రావడంతో ప్రమాద తీవ్రత స్పష్టమవుతోంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -



