Saturday, May 23, 2026
E-PAPER
Homeజాతీయంఇంధ‌న ధ‌ర‌ల పెంపు..ప్ర‌జ‌ల‌కు స్లో పాయిజ‌న్

ఇంధ‌న ధ‌ర‌ల పెంపు..ప్ర‌జ‌ల‌కు స్లో పాయిజ‌న్

- Advertisement -
  • ఆప్ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఒకే నెల‌ల్లో మూడు సార్లు ఇంధ‌న ధ‌ర‌ల‌ను మోడీ ప్ర‌భుత్వం పెంచిన విష‌యం తెలిసిందే. యుద్ధం సాకుతో మొద‌ట్లో గ్యాస్ ధ‌ర‌ల‌ను పెంచిన బీజేపీ స‌ర్కార్, ఐదు రాష్ట్రాల ఎన్నికల‌ ఫ‌లితాల త‌ర్వాత పెట్రోల్, డీజీల్, సీఎన్‌జీ ధ‌ర‌ల‌ను పెంచింది. మోడీ ప్ర‌భుత్వ చ‌ర్య‌ల‌పై ఆప్ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ విమ‌ర్శ‌లు గుప్పించారు. ఇంధ‌న ధ‌ర‌ల‌ను పెంచుతూ మోడీ ప్ర‌భుత్వం సామాన్య ప్ర‌జ‌ల‌కు స్లోగా పాయిజన్ ఎక్కిస్తోంద‌ని ఆయ‌న మండిప‌డ్డారు. ఈమేర‌కు ఎక్స్ వేదిగా వీడియో విడుద‌ల చేశారు.

‘‘కేంద్ర ప్ర‌భుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచింది. గత 10-15 రోజుల్లో, వారు ధరలను పెంచడం ఇది మూడోసారి. గత 10-15 రోజుల్లో, పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు 4 నుండి 5 రూపాయల వరకు పెరిగాయి. గ్యాస్ సిలిండర్ల ధరలు కూడా బాగా పెరిగాయి. ప్రజలు తమ ఇళ్లను నడుపుకోవడానికే ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికీ ప్రజలు చాలా భయపడి ఉన్నారు. వారు షాక్‌లో ఉన్నారు. రాబోయే రోజుల్లో ధరలు ఎంత పెంచబోతున్నారో ప్రజలకు తెలియడం లేదు. అంతటా పుకార్లు వినిపిస్తున్నాయి. ఇప్పుడు, ధరలు చాలా పెరుగుతాయి. 150 రూపాయలకు చేరుకుంటాయి. ఎంత పెరుగుతుందో నాకు తెలియదు’’ అని ఆయ‌న ఆరోపించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -