- Advertisement -
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా కె.శ్రీనివాస్, పల్లె నరసింహ ఎన్నికయ్యారు. బుధవారం హైదరాబాద్లోని బషీర్బాగ్లో గల దేశోద్దారక భవన్లో ఆ సంఘం రాష్ట్ర నాలుగో మహాసభలు ముగిశాయి. మహాసభలో 55 మందితో రాష్ట్ర కౌన్సిల్ను ఎన్నుకున్నారు. అందులో 23 మంది రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా, పది మంది ఆఫీస్ బేరర్లుగా ఉండనున్నారు. గౌరవ అధ్యక్షులుగా కవ్వంపల్లి స్వామి, ఉపాధ్యక్షులుగా కన్నం లక్ష్మీనారాయణ, ఆరెల్లి రవి, వి.కొండలరావు, సంయుక్త కార్యదర్శిగా రేగుంట చంద్రశేఖర్, సహాయ కార్యదర్శిగా బి జగన్, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా కేతరాజు ఉప్పలయ్య, కోశాధికారిగా పడాల నళిని ఎన్నికయ్యారు.
- Advertisement -



