అహ్మదాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం నుంచి రెండు రోజుల పాటు సొంత రాష్ట్రమైన గుజరాత్లో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ఆయన రూ.77,400 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారం భిస్తారు. మోడీ ఎల్ లోకోమోటివ్ తయారీ ప్రాజెక్టును ప్రారంభిస్తారని, దాహోద్ నుంచి ఎలక్ట్రిక్ లోకోమో టివ్కు పచ్చజెండా ఊపుతారని ఓ ప్రకటనలో వివరించారు. భుజ్లో రూ.53,400 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను కూడా ప్రధాని ప్రారంభిస్తారు. 20 సంవత్సరాల గుజరాత్ పట్టణ ప్రగతిని చాటిచెప్పే ఓ కార్యక్రమానికి మోడీ హాజరవు తారు. గాంధీనగర్లో పట్టణాభివృద్ధి సంవత్సరాన్ని ప్రారంభిస్తారు. వెరావల్-అహ్మదాబాద్ మధ్య నడిచే వందేభారత్ రైలును, వల్సాద్- దాహోద్ మధ్య నడిచే ఎక్స్ప్రెస్ రైలును కూడా ప్రారంభిస్తారు. వీటితో పాటు మరికొన్ని అభివృద్ధి పనులకు కూడా మోడీ శ్రీకారం చుడతారు.