- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఎన్టీఆర్ జయంతి సందర్భంగా హైదరాబాద్లోని మైత్రీవనం కూడలిలో ఆయన విగ్రహాన్ని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఆయన చేసిన సేవలను గుర్తుచేశారు. విగ్రహావిష్కరణకు ఎన్టీఆర్ కుమారులు మోహన్కృష్ణ, రామకృష్ణ హాజరయ్యారు. కార్యక్రమంలో దర్శకుడు బోయపాటి శ్రీను, సినీ నటుడు మంచు మనోజ్తో పాటు కాంగ్రెస్ నేతలు, అభిమానులు పాల్గొన్నారు.
- Advertisement -



