Friday, August 21, 2026
E-PAPER
Homeజాతీయంఐటీ ఉద్యోగం వదిలి వ్యవసాయం..పిడుగుపాటుకు గురై మృతి

ఐటీ ఉద్యోగం వదిలి వ్యవసాయం..పిడుగుపాటుకు గురై మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : కర్ణాటకకు చెందిన 43 సంవత్సరాల మాజీ టెక్కీ కమ్ రైతు తన కుటుంబంతో కలిసి మైసూరులోని వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శిస్తుండగా పిడుగుపాటుకు గురై మరణించాడు. మడికెరె పట్టణానికి చెందిన 43 సంవత్సరాల రోషన్ బాలకృష్ణ అనే ఐటీ ఉద్యోగి వ్యవసాయంపై ఆసక్తితో ఇటీవల తన ఉద్యోగాన్ని వదిలేశాడు. స్నేహితుడితో కలిసి వ్యవసాయం చేయడం ప్రారంభించాడు. అతను ఆధునిక వ్యవసాయ పరికరాల మార్కెటింగ్ కూడా చేస్తున్నాడు.

సాగునీటి ప్రణాళికల్లో భాగంగా కుటుంబ సభ్యులతో కలిసి మైసూరులోని తన పొలం చూసేందుకు వెళ్లాడు. ఓ మామిడి చెట్టు వద్ద పండ్లు కోయడానికి ప్రయత్నిస్తున్న సమయంలో భారీ వర్షంతో పాటు పిడుగు పడింది. దీంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడి కుటుంబానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రూ.5 లక్షల పరిహారం ప్రకటించాయి. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -