నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం నాడు జుక్కల్ మండలానికి చెందిన అర్హులైన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీ కాంతారావు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు ప్రభుత్వమే అండగా ఉంటుందన్న భరోసాను కల్పించడమే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏ ఒక్క కుటుంబం కూడా ఇబ్బంది పడకూడదనే మంచి ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాలను అమలు చేస్తూ పేద కుటుంబాల్లో వెలుగులు నింపుతోందని అన్నారు. అలాగే, వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన ఆర్థిక సహాయాన్ని (సీఎం ఆర్ ఎఫ్ చెక్కులు) లబ్ధిదారులకు అందజేయడం జరిగిందని తెలిపారు. ఈ సహాయం పేదల ఆరోగ్య సమస్యలకు ఆర్థిక భరోసాగా నిలుస్తోందని ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు, వివిధ గ్రామాల సర్పంచులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
చెక్కులను అందజేసిన జుక్కల్ ఎమ్మెల్యే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



