నవతెలంగాణ-హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు డీఈడీ కాలేజీల్లో రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన టీజీ డీఈఈసెట్-2026 (TG DEECET 2026) ఫలితాలు విడుదలయ్యాయి. అధికారిక వెబ్సైట్లో ఫలితాలను ఉంచామని అధికారులు తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు జూన్ 2వ తేదీ నుంచి 5వ తేదీ వరకు సర్టిఫికెట్ ధ్రువీకరణ ప్రక్రియ ఉంటుందని పేర్కొన్నారు. అనంతరం జూన్ 6 నుంచి 8వ తేదీ వరకు వెబ్ ఆప్షన్ల ప్రక్రియ కొనసాగనుంది.
మే 21వ తేదీన నిర్వహించిన ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 35,592 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 25,054 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 21,137 మంది అర్హత సాధించారు. అంటే మొత్తం 84.36 శాతం ఉత్తీర్ణత నమోదైంది.



