- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : కడప జిల్లా ప్రొద్దుటూరులో స్థానిక మున్సిపాలిటీ అధికారి ఒకరు హోటల్ వద్దకు వెళ్లి కాఫీ అడిగారు. హోటల్ యాజమాన్యం నిరాకరించడంతో అధికారి జేసీబీని తెప్పించి బెదిరించారు. హోటల్ ఎదుట అక్రమంగా ర్యాంప్ ఏర్పాటు చేశారని, వాటిని తొలగించాలని అధికారి డిమాండ్ చేశారు. అయితే తనపై నుంచి పోనిచ్చి ర్యాంప్ తొలగించాలని హోటల్ యజమాని నిరసన వ్యక్తం చేశారు. ఈ ఘటన పట్టణంలోని ప్రధాన కూడలి వద్ద జరిగింది.
- Advertisement -



