- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: విదేశీ పర్యటనలో భాగంగా శనివారం ప్రధాని మోడీ మలేషియాకు వెళ్లారు. ఎయిర్పోర్టులో పీఎం మోడీకి ఆ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీం స్వాగతం పలికారు. ఆ తర్వాత ఇద్దరు ప్రధానులు అధికారిక హోటల్ వైపు ఒకే కారులో ప్రయాణించారు. భారత్ ప్రధాని రెండు రోజులు మలేషియాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఇరువురు నేతల కీలక అంశాలపై చర్చించి పలు ఒప్పందాలు చేసుకున్నారు. ప్రధానంగా రెండు దేశాలు డిపెన్స్ రంగంలో పరస్పర సహాకరం అందిపుచ్చుకొన్నాయి. అదే పలు రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి కృషి చేయనున్నారు.
- Advertisement -



