- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: రాష్ట్రంలో సవరించిన భూముల మార్కెట్ విలువలు నేటి నుంచి అమలోకి రానున్నాయి. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ భూముల విలువలు ఎకరాకు రూ.2.75 లక్షలు, మునిసిపల్ కార్పొరేషన్లలో ఎకరాకు రూ.5లక్షలు, హెచ్ఎండీఏ పరిధిలో ఎకరాకు రూ.10లక్షలు, ఓఆర్ఆర్ లోపల ఎకరాకు రూ.15 లక్షల చొప్పున కనిష్ఠ విలువ నిర్ణయించామన్నారు. సవరించిన భూముల విలువలపై అభ్యంతరాలు తెలిపేందుకు టోల్ఫ్రీ నంబరు(1800 599 4788)ను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. వాట్సాప్ నంబరు (8247619983)కు సైతం ఫిర్యాదు చేయవచ్చని అధికారులు వెల్లడించారు.
- Advertisement -



