Monday, February 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎన్నికల సిబ్బంది మూడో విడత ర్యాండమైజెషన్ పూర్తి

ఎన్నికల సిబ్బంది మూడో విడత ర్యాండమైజెషన్ పూర్తి

- Advertisement -

జిల్లా ఎన్నికల పరిశీలకులు శివ కుమార్ నాయుడు..
జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ సమక్షంలో మూడో ర్యాండమైజేషన్
నవతెలంగాణ – పరకాల 

హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో పరకాల పురపాలక ఎన్నికల సిబ్బంది మూడో విడత ర్యాండమైజేషన్ ను సోమవారం పూర్తి చేశారు. జిల్లా ఎన్నికల పరిశీలకులు కె. శివ కుమార్ నాయుడు, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ స్నేహ శబరీష్ సమక్షంలో ఎన్నికల సిబ్బంది మూడో విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. 

పరకాల పురపాలక సంఘంలో 22వార్డులకు ఈ నెల 11న ఎన్నికలు జరగనున్న దృష్ట్యా ఎన్నికల విధులను నిర్వర్తించే పోలింగ్, అదనపు పోలింగ్ అధికారులు, ఓపీవోల ఆయా వార్డులకు ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. 22 వార్డులకు 44 పోలింగ్ కేంద్రాలు ఉండగా 44మంది పోలింగ్ అధికారులు, అదనంగా తొమ్మిది మంది (ఇరవై శాతం )మొత్తంగా 53మంది, అదనపు పోలింగ్ అధికారులు 44 మంది (ఇరవై శాతం) అదనంగా కలిపి 53మంది, ఓపీవోలు 132 మంది, అదనంగా ఇరవై శాతం కలిపి 158మంది, అదేవిధంగా రిజర్వు సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయింపు చేశారు. ఈ సందర్భంగా పరకాల పురపాలక కమిషనర్ అంజయ్య, టౌన్ ప్లానింగ్ అధికారి సుష్మ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -