- Advertisement -
నవతెలంగాణ-బెజ్జంకి
మండల పరిధిలోని గాగీళ్లపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ ఎర్రల జానకి అధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి ఆదివారం విశేష స్పందన లభించింది.కరీంనగర్ పట్టణంలో సుప్రీమ్ ఆస్పత్రి వైద్య సిబ్బంది వైద్య శిబిరానికి హజరైన గ్రామస్తులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణి చేశారు. ఆరోగ్యమే ఆసలైన సంపదనే స్పృహతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించినట్టు సర్పంచ్ జానకి అభిప్రాయం వ్యక్తం చేశారు. వార్డు సభ్యులు,వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -



