నవతెలంగాణ – పెద్దవూర : నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం పెద్దవూర మండలం చింతపల్లి గ్రామం లో తెలంగాణ తొలి దళితకవి దున్న ఇద్దాసు ఆరాధనోత్సవాల సందర్బంగా నేటినుంచి జరిగే జాతీయ స్థాయి మహిళా కబడ్డీ పోటీలకు ఆలయ కమిటీ బుధవారం అంతా సిద్ధం చేశారు. దున్న ఇద్దాస్ ఆలయ ఛైర్మెన్ ఎస్కే అబ్బాస్,సర్పంచి జాటావత్ రవి నాయక్, మాజీ సర్పంచ్ సుంకిరెడ్డి ప్రభావతి సంజీవరెడ్డి, మాజీ ఉపసర్పంచ్ భారతి కొండలు ఆధ్వర్యంలో కబడ్డీ గ్రౌండు అందంగా ముస్తాబు చేశారు. ఈ పోటీలు పార్టీలకు అతీతంగా జరుగ నున్నాయి. ఈ పోటీలు మ్యాట్ పై మూడు రోజుల పాటు డే అండ్ నైట్ జరుగనున్నాయి.ఈ పోటీకు జాతీయ స్తాయిలో 14 టీములు పాల్గొన్నాయి.ఈ పోటీలలో విజేతలకు మొదటి బహుమతి రూ.1,00,000/- రెండో బహుమతి రూ.75,000/- మూడో నాలుగో, బహుమతి రూ.50,000/- ఐదవ బహుమతి 40,000/- ఆరో బహుమతి 30,000/- ఇవ్వాలని దేవాలయ కమిటీ నిర్ణయించింది.
జాతీయ స్థాయి మహిళా కబడ్డీ పోటీలకు సర్వం సిద్ధం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



