- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: టీ20 వరల్డ్కప్లో దక్షిణాఫ్రికాతో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్లో అఫ్గానిస్థాన్ ఓటమి పాలైన అనంతరం కెప్టెన్ రషీద్ ఖాన్ భావోద్వేగానికి లోనయ్యాడు. రెండుసార్లు విజయం చేజారడం పట్ల విచారం వ్యక్తం చేస్తూనే, జట్టు ప్రదర్శనపై గర్వం వ్యక్తం చేశాడు. 10 ఓవర్లలో 100 పరుగులు చేసిన ప్రత్యర్థిని 190 లోపే కట్టడి చేయడం గొప్ప ప్రయత్నమని ప్రశంసించాడు. రహ్మనుల్లా గుర్బాజ్ అద్భుతమైన బ్యాటింగ్ను కొనియాడాడు. ఒక్క బంతికి ఐదు పరుగులు కావాల్సిన స్థితిలో ఏదైనా జరగవచ్చని, అయితే ఈ మ్యాచ్ నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయని, వచ్చే మ్యాచులలో మెరుగ్గా రాణిస్తామని నమ్మకం వ్యక్తం చేశాడు.
- Advertisement -



