- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : రాష్ట్రంలో రాబోయే రెండు గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. సూర్యాపేట, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఈ జిల్లాల్లో గంటకు 60-80 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉంది. హైదరాబాద్, ఖమ్మం, మహబూబాబాద్, మెదక్, మేడ్చల్ మల్కాజిగిరి, నల్గొండ, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, భద్రాద్రి కొత్తగూడెం, జనగాం, సిద్దిపేట, వరంగల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
- Advertisement -



