- Advertisement -
న్యూఢిల్లీ : హార్ముజ్ జలసంధిలో భారత్కు సంబంధించిన నౌకలపై టెహ్రాన్ డ్రోన్ దాడులు జరుపుతోందంటూ అమెరి కా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఆరోపణను ఇరాన్ తోసిపుచ్చింది. ఈ ఆరోపణ పూర్తిగా నిరాధా రమని తెలిపింది. వాణిజ్య నౌకలపై అమెరికా సైన్యం జరుపు తున్న దాడుల నుంచి దృష్టి మళ్లించేందుకు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నా రని ఆరోపిం చింది. ఈ మేరకు న్యూఢిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయం సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్లో ఓ పోస్ట్ పెట్టింది. వారం రోజుల కంటే తక్కువ వ్యవధిలోనే అమెరికా సేనలు మూడు భారత నౌకలపై క్రూరమైన దాడులు జరిపాయని, అమా యకులైన ముగ్గురు నావికులను హతమా ర్చాయని, ఇది చాలా బాధాకరమని తెలిపింది.
- Advertisement -



