- Advertisement -
నవతెలంగాణ- మద్నూర్
నూతనంగా ఎన్నికైన డోంగ్లి మండలంలోని గ్రామపంచాయతీ వార్డ్ సభ్యులకు ఈనెల 16 నుండి 20వ తేదీ వరకు మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు డోంగ్లి మండల ఎంపీడీవో ఒక ప్రకటన ద్వారా విలేకరులకు తెలిపారు. శిక్షణ తరగతులకు వార్డు సభ్యులు ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పాల్గొనాలని అధికారులు కోరారు. ఈ కార్యక్రమానికి వార్డు సభ్యులందరూ హాజరై విజయవంతం చేయాని ఈ సందర్భంగా ఎంపీడీఓ కోరారు.
- Advertisement -



