నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని బస్వాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను సోమవారం ఎంపీడీవో శ్రీనివాస్ మార్కౌట్ చేశారని జిపి కార్యదర్శి భరద్వాజ్ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గ్రామ పెద్దలు సురేష్ గుండా ఆధ్వర్యంలో పలువురి లబ్ధిదారుల గృహ నిర్మాణాలు ఏర్పడుతున్న వారి నిర్మాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. బస్వాపూర్ గ్రామానికి మొత్తం 31 ఇందిరమ్మ గృహ పథకంలో లబ్ధిదారులకు ఇండ్లు మంజూరు చేశామన్నారు. వాటిలో 22 వరకు స్టార్టింగ్ దశ లెవల్లో ఉన్నాయని, 9 రూఫ్ లెవెల్లో నిర్మాణాలు జరుగుతున్నాయని, నాలుగు బేస్మెంట్ లేవలో ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, గృహ నిర్మాణాల లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
బస్వాపూర్ లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు ప్రారంభం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



