- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఈ ఖరీఫ్ సీజన్కు సంబంధించిన ‘రైతు భరోసా'(ఎకరానికి రూ.6,000) నిధులను జూన్ నెలాఖరులోగా విడుదల చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వ్యవసాయ శాఖ నుంచి రైతుల వివరాలను సేకరించింది. కొత్తగా పట్టాలు పొందిన వారికి నోటిఫికేషన్ విడుదలైన వారం రోజుల్లోనే ఒక ఎకరానికి సాయం జమ చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. గత యాసంగి సీజన్లో గరిష్ఠంగా రెండెకరాల వరకు ప్రభుత్వం సాయం అందించగా.. వానాకాలంలో మాత్రం ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.
- Advertisement -



