- Advertisement -
పాఠశాల ప్రత్యేక అధికారి ఎం.భవాని
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని దుబ్బపేట గ్రామపరిదిలోని కెజిబివి ఆశ్రమ పాఠశాలలో 6నుంచి 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ పిల్లలకు తెలుగు, ఏకనామిక్స్,సీవీక్స్ బోధించుటకు తాత్కాలిక పద్దతిలో ఉపాధ్యాయులు, అలాగే పాఠశాలలో నర్సింగ్-1,నర్సింగ్-2 అర్హత గలవారు గెస్ట్ ఫ్యాకల్టీ కోసం 16 నుంచి18 వతేదీలోపు దరఖాస్తులు సమర్పించాలని ప్రిన్సిపాల్ ఎం.భవాని మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు ఈ నియామకం తాత్కాలిక పద్ధతిలో జరుగుతుందని, అభ్యర్థులు ఆయా సబ్జెక్టులో పి.జి,బి.ఇడి పూర్తి చేసి టెట్ క్వాలిఫై అయి ఉండాలన్నారు. 19న సాయంత్రం 4 వరకు దరఖాస్తులు తీసుకోబడునని తెలిపారు.
- Advertisement -



