డ్రగ్స్ పై విద్యార్థులకు అవగాహన సదస్సు
నవతెలంగాణ – తంగళ్ళపల్లి
డ్రగ్స్, నార్కోటిక్ లాంటి దురాలవాట్లకు విద్యార్థులు దూరంగా ఉండాలని ప్రముఖ సైకాలజిస్ట్ కె. పున్నంచందర్ అన్నారు. తెలంగాణ గురుకుల పాఠశాల బద్దెనపల్లి, నేరెళ్ల గర్ల్స్ కాలేజ్, కస్తూర్బా బాలికల విద్యాలయం, తంగల్లపల్లి విద్యార్థులకు పరీక్షలపై సానుకూల దృక్పథం, డ్రగ్స్,పరీక్షలలో ఒత్తిడిని జయించడం పై విద్యార్థులకు ప్రముఖ సైకాలజిస్ట్ కె. పున్నంచందర్ అవగాహన కల్పించారు.సైకాలజిస్ట్ మాట్లాడుతూ డ్రగ్స్ లోని రకాలు వాటి వినియోగం వలన కలుగు దుష్పరిణామాలు వివరించారు. డ్రగ్స్,నార్కోటిక్ లాంటి వాటికి దూరంగా ఉండడమే కాకుండా ఉపయోగించే వారికి కూడా దూరంగా ఉండాలనీ విద్యార్థులకు సూచించారు.
చదువు పట్ల ఏకాగ్రత పెంచుకోవడం, పరీక్షల పట్ల సానుకూల దృక్పథం పెంపొందించుకోవడం ద్వార వపరీక్షల్లో విజయం సాధించవచ్చని తెలిపారు. అందుకు అవసరమైన సలహాలను కౌన్సిలింగ్ ద్వారా అందించారు. డ్రగ్స్ రహిత తెలంగాణ కొరకు ప్రభుత్వం కృషి చేస్తుందని అందుకు మనమందరం సహకరించాలని ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమంలో ప్రముఖ సైకాలజిస్ట్ కనుకుంట్ల పున్నంచందర్, డా. చంద్రిక రెడ్డి,ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ బత్తిని రఘు , కానిస్టేబుల్ నరేందర్, హెల్పింగ్ హార్స్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు అల్వాల ఈశ్వర్, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.



