నవతెలంగాణ – అశ్వారావుపేట
పీఎస్ గాండ్లగూడెం పాఠశాలలో ఈ రోజు ప్రీ-ప్రైమరీ, 1 వ తరగతి విద్యార్థులకు గురువారం సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. విద్యాభ్యాసానికి తొలి మెట్టుగా భావించే ఈ కార్యక్రమంలో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీశైలం (సిద్ధు), ఉపాధ్యాయులు దుర్గా ప్రసన్న పాల్గొని విద్యార్థులకు ఆశీస్సులు అందించారు. అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు హాజరై చిన్నారుల విద్యా ప్రస్థానానికి శుభారంభం పలికారు.
విద్యార్థుల్లో చదువుపై ఆసక్తి పెంపొందించడంతో పాటు విద్య ప్రాముఖ్యతను తెలియజేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని ఉపాధ్యాయులు తెలిపారు. అక్షరాభ్యాసం ద్వారా చిన్నారుల విద్యా ప్రయాణం విజయవంతంగా సాగాలని ఆకాంక్షించారు.



