- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : నాగర్కర్నూల్ జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బ్రహ్మగిరి రేంజ్ తాటి గుండాల సెక్షన్లో చెలరేగిన మంటలు 24 గంటలు గడిచినా అదుపులోకి రాలేదు. గడ్డి ఆవాసాలు ఎక్కువగా ఉండటంతో వందల హెక్టార్ల అడవి అగ్నికి ఆహుతైంది. 30 మందికి పైగా అటవీ శాఖ సిబ్బంది, టైగర్ ట్రాకర్లు మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
- Advertisement -



