నవతెలంగాణ – పెద్దవూర
తమను విద్యాబుద్ధులు నేర్పి ప్రయోజకులుగా తీర్చిదిద్దిన గురువు, నవతెలంగాణ రిపోర్టర్ మూల శేఖర్ రెడ్డిని గర్నెకుంట నూతన సర్పంచి పీల్లి ఏడుకొండలు, ఉపసర్పంచి చెరకుపల్లి చంద్రమౌళి, మాజీ సర్పంచి వార్డు సభ్యులు శుక్రవారం గర్నెకుంట గ్రామ పంచాయతీ కార్యాలయం లో శాలువ కప్పి ఘన సన్మానం చేశారు. ఈ సందర్బంగా సర్పంచ్ మాట్లాడుతూ.. తమకు పునాదులు వేసిన గురువులను శాలువాలతో, పూలమాలలతో సన్మానించి ఆత్మీయతను చాటుకుంటున్నాన్నని తెలిపారు.
అంతే గాక మండలంలో నెలకొన్న పలు సమస్యలు నవతెలంగాణ పత్రికలో రాస్తూ సమస్యలనుసంభందిత అధికారులు దృష్టికి తీసుకెళ్లే విదంగా కతనాలు, వార్తలు రాసి కృషిచే స్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమం లో గ్రామ పంచాయతీ కార్యదర్శి నామ రమేశ్, మాజీ సర్పంచ్ నడ్డిహాలియమ్మ, రామాంజనేయులు, వార్డ్ మెంబర్లుమెండే శంకర్, పుట్టపాక మంజుల,క ట్టేబోయిన రాంబాబు, పంగ రేణుక, చేర్కుపల్లి సరిత, నడ్డి శంకరయ్య, పగిళ్ల వెంకటయ్య, మెండే యాదయ్య, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.



