- Advertisement -
పలు సమస్యలపై వినతి
సానుకూలంగా స్పందన
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్ల సర్పంచ్ బండి స్వామి,ఉప సర్పంచ్ బొబ్బిలి రాజు గౌడ్ రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు శుక్రవారం భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా గ్రామ సమస్యలు, ఓసీపీకి డేంజర్ జోన్లో ఉన్న ఇండ్ల, భూముల సమస్యలపై కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. కలెక్టర్ సమస్యలపై సానుకూలంగా స్పందించారు. త్వరలోనే పరిస్కారం అయ్యేలా చూస్తామని హామీ ఇచ్చినట్లుగా సర్పంచ్, ఉప సర్పంచ్ వెల్లడించారు.
- Advertisement -



