Friday, February 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కూలీలకు పాత పద్దతుల్లోనే వేతనాలు జమ చేయాలి

కూలీలకు పాత పద్దతుల్లోనే వేతనాలు జమ చేయాలి

- Advertisement -

పెద్దతూండ్ల సర్పంచ్ బండారి నర్సింగం
నవతెలంగాణ – మల్హర్ రావు

ఉపాధిహామీ కూలీలకు పాత పద్దతుల్లోనే అన్ని గ్రామీణ బ్యాంకుల్లో వేతనాలు జమ చేయాలని మండలంలోని పెద్దతూండ్ల గ్రామ సర్పంచ్ బండారి నర్సింగం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం ఉపాధిహామీ కూలీలు చేస్తున్న పనులను పనిప్రదేశంలో పరిశీలించారు. పనులు చేస్తున్న ప్రదేశంలో కూలీలకు ఏర్పాటు చేసిన కనీస సౌకర్యాలపై కూలీలను అడిగి తెలుసుకున్నారు.

జాతీయ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఉపాధి చట్టాన్ని బిజెపి నిర్వీర్యం చేసే కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. ఉపాధిహామీ పథకాన్ని ఇటీవల కేంద్రం ఎబిజి రామ్ పేరున మార్పులు చేర్పులు చేసి కూలీలను ఇబ్బందులకు గురిచేసే యత్నం చేయడం సరికాదన్నారు. కొత్త రూల్స్ ప్రకారం ప్రయివేటు బ్యాంకులు, జాతీయకరణ పొందని కొన్ని గ్రామీణ బ్యాంకుల్లో వేతనాలు జమకావు,కేవలం జాతీయ బ్యాంకులు,పొస్తపిసుల్లో మాత్రమే వేతనాలు జమవుతాయని చెప్పడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో  ఉపసర్పంచ్ తాళ్ళ రవీందర్,వార్డు సభ్యులు,ఉపాధిహామీ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -