- Advertisement -
అంతర్జాతీయ ఫోరం అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన భారత నౌకాదళం
సభ్య దేశాల మధ్య సమన్వయం పెంచుతాం : దినేష్ కె త్రిపాఠి
విశాఖ : విశాఖ కేంద్రంగా ఈనెల 15 నుంచి జరుగుతోన్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్ఆర్) మిలాన్-2026లో భాగంగా శుక్రవారం తూర్పునౌకాదళంలో 9వ ఇంటర్నేషనల్ ఓషన్ నేవల్ సింపోజియం (ఐఒఎన్ఎస్ -ఐయాన్స్) కాన్క్లేవ్ జరిగింది.
‘హిందూ మహా సముద్ర ప్రాంతంలో సముద్ర భద్రతను పటిష్టం చేసే దిశగా భారత్ మరో కీలక అడుగు వేసింది. భారత నౌకాదళం దీని అధ్యక్ష్య బాధ్యతలను స్వీకరించింది. రాయల్ థారులాండ్ నేవీ నుంచి నేవల్ చీఫ్ (అడ్మిరల్) దినేష్ కె త్రిపాఠి ఈ బాధ్యతలను తీసుకున్నారు.
- Advertisement -



