Wednesday, April 22, 2026
E-PAPER
Homeజాతీయంఏడాది గడచినా మనం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఐక్యంగా ఉన్నాము : ఒమర్ అబ్దుల్లా

ఏడాది గడచినా మనం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఐక్యంగా ఉన్నాము : ఒమర్ అబ్దుల్లా

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : సరిగ్గా ఈరోజునే ఏడాది క్రితం జమ్మూ కాశ్మీర్ పెహల్గామ్ దాడి జరిగింది. ఈ దాడిలో 26 మంది మృతి చెందారు. బుధవారం ఈ దాడిలో మృతులకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా నివాళి అర్పించారు. కాగా, ‘ఒక సంవత్సరం గడచినా, మనం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఐక్యంగానే ఉన్నాము. జమ్మూ కాశ్మీర్‌ను బాధల నుండి, అమాయకుల మరణాల నుండి విముక్తి చేయాలనే మా సంకల్పంలో మేము దృఢంగా ఉన్నాము. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇలాంటివి జరగకుండా చూసేందకు మాకు సాధ్యమైనంతా చేస్తున్నాము. ఈ దాడిలో తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు మేము ఎల్లప్పుడూ అండగా ఉంటాము అని` సామాజిక మాధ్యమం ఎక్స్ పోస్టులో ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు.

కాగా, పెహల్గామ్ దాడిలో మృతి చెందిన వారికి లెఫ్ట్ నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా నివాళి అర్పించారు. ‘2025వ సంవత్సరం ఇదే రోజున పహల్గామ్‌లో జరిగిన దారుణమైన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన అమాయక ఆత్మలకు నేను వినయపూర్వకంగా నివాళులు అర్పిస్తున్నాను. వారి జ్ఞాపకాలు మన హృదయాలలో చెరగని ముద్ర వేస్తాయి. నా ఆలోచనలు, ప్రార్థనలు వారి కుటుంబాలతో ఉన్నాయి` అని గవర్నర్ ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -