- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక, దర్యాప్తు తీరును హైకోర్టు తప్పుపట్టలేదని టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్ అన్నారు. విధానపరమైన నిర్ణయాన్ని మాత్రమే తప్పుపట్టిందని చెప్పారు. హైకోర్టు తీర్పును పరిశీలించిన అనంతరం ప్రభుత్వం తదుపరి చర్యలకు వెళ్తుందన్నారు. కాళేశ్వరం దోషులు ఎప్పటికైనా జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. ‘‘కాళేశ్వరంలో అవినీతి జరిగిందని భాజపా నేతలు గతంలో అనలేదా? ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు కోరితే కేంద్రం ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు’’ అని ప్రశ్నించారు.
- Advertisement -



