- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. రాయలసీమ, తమిళనాడు మీదుగా తెలంగాణ నుంచి మన్నార్ గల్ఫ్ వరకు ఒక ద్రోణి కొనసాగుతుండటంతో రుతుపవనాలు పుంజుకున్నాయి. ఈ ద్రోణి ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో మూడు రోజులు వర్షాలు దంచికొట్టనున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిలకు జారీ చేసింది.
- Advertisement -



