నవతెలంగాణ-హైదరాబాద్ : ఆస్పత్రిలో చకిత్స పోందుతున్న కేరళ ఆరోగ్యమంత్రి వీణాజార్జ్ని కేరళ సీఎం విజయన్ పరామర్శించారు.
కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి సంఘం కేరళ స్టూడెంట్స్ యూనియన్ (కెఎస్యు) వీణాజార్జ్ పై దాడికి యత్నించింది. ఈ దాడిలో ఆమె మెడ, చేతికి స్వల్పగాయాలయ్యాయి. కన్నూర్ రైల్వేస్టేషన్లో బుధవారం ఈ ఘటన జరిగింది. కల్లియాడ్లో అంతర్జాతీయ ఆయుర్వే పరిశోధన కేంద్రాన్ని ప్రారంభించి తిరిగి వస్తుండగా కన్నూర్ రైల్వే స్టేషన్లో ఆమెపై కెఎస్యు విద్యార్థులు దాడికి యత్నించారు. వైద్య చికిత్స నిమిత్తం ఆమెను కన్నూరు జిల్లా ఆస్పత్రికి తరలించారు.
ఆస్పత్రికి వెళ్లి వీణాజార్జ్ ను సీఎం పినరయి విజయన్ పరామర్శించి వివరాలు తెలుసుకున్నారు.
ఐద్వా జాతీయ అధ్యక్షురాలు పికె శ్రీమతి టిచర్ వీణా జార్జ్ను పరామర్శించారు.
వీణాజార్జ్ ను పరామర్శించిన కేరళ సిఎం విజయన్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



