- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మూసీ ప్రాజెక్టుతో ఎవరికీ అన్యాయం జరగనీయబోమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. మూసీ ప్రాజెక్టుకు భూ సేకరణ, పునరావాసంపై ఆయన సోమవారం సమీక్ష నిర్వహించారు. మానవీయ కోణంలో భూసేకరణ చేయాలని అధికారులను ఆదేశించారు. ఇళ్లు కోల్పోయే వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించాలన్నారు. భూములు కోల్పోయే వారికి పరిహారం, పునరావాసం విషయంలో రాజీ పడబోమన్నారు.
- Advertisement -



