- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: రామమందిర విరాళాల దుర్వినియోగం కేసులో దర్యాప్తు మరింత వేగవంతమైంది. ఆలయ విరాళాల దుర్వినియోగం కేసు దర్యాప్తులో భాగంగా, శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ మాజీ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేశారు. ఈ మేరకు సోమవారం నాడు సంబంధిత వర్గాలు తెలిపాయి. చంపత్ రాయ్ను ఇప్పటికే ప్రశ్నించినప్పటికీ, దర్యాప్తులో అవసరమైతే అనిల్ మిశ్రాతో సహా ట్రస్ట్కు చెందిన ఇతర సీనియర్ బాధ్యుల వాంగ్మూలాలను కూడా తర్వాత నమోదు చేస్తారని ఆ వర్గాలు వెల్లడించాయి.
- Advertisement -



