- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : వెనిజులాలో భూకంప శిథిలాల నుంచి మృతదేహాలు బయటపడుతూనే ఉన్నాయి. మరణించిన వారి సంఖ్య 1,719కి చేరినట్లు అధికారులు వెల్లడించారు. 5,034 మంది గాయపడ్డారని, 15,866 మంది నిరాశ్రయులయ్యారని తెలిపారు. మరోవైపు రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తుండగా పలువురు ప్రాణాలతో బయటపడుతున్నారు. కాగా వెనిజులాకు 30 దేశాల నుంచి వెయ్యి మెట్రిక్ టన్నుల సరకులు అందాయి.
- Advertisement -



