- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: ఏపీ, 2018 గ్రూప్-1 నియామకాలపై సుప్రీంకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. ప్రాధాన్యత లేని పోస్టులకు బదిలీ చేస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్ ఉత్తర్వులు సరిగానే ఉన్నాయని, ప్రాధాన్యత ఉన్న పోస్టులు ఇవ్వకపోతే ఉద్యోగాలు చేయలేరా అని అభ్యర్థులను ప్రశ్నించింది. ఉన్నదాంట్లో సంతృప్తి పడాలని ధర్మాసనం పేర్కొంది.
- Advertisement -



