- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: అయోధ్యలో రామమందిర విరాళాల దుర్వినియోగం కేసులో పోలీసులు బుధవారం దర్యాప్తును ముమ్మరం చేశారు. విరాళాల నగదు దారి మళ్లింపులో కీలక పాత్ర పోషించిన 8మందిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా, అనుకల్ప్ మిశ్రా, లవ్కుశ్ మిశ్రా , కరుణేష్ పాండే వంటి నిందితుల నివాసాలలో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఆలయ నిధులను అక్రమంగా మళ్లించిన వ్యవహారంపై జరుగుతున్న దర్యాప్తులో భాగంగా, అందుకు సంబంధించిన ఆధారాలను సేకరించేందుకు ఒక పోలీసు బృందం అనుకల్ప్ మిశ్రా నివాసానికి చేరుకుంది.
- Advertisement -



