నవతెలంగాణ – మద్నూర్
ప్రభుత్వ డిగ్రీ కళాశాల మద్నూర్ లో జాతీయ విజ్ఞాన దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ కె. అశోక్ కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడుతూ జాతీయ సైన్స్ దినోత్సవం నకు మూలపురుషుడు సి. వి. రామన్ ఆయన సేవలను కొనియాడారు. రామన్ ఎఫెక్ట్ భారత సైన్స్ ప్రపంచంలో ఒక గొప్ప మైలురాయి అని తెలిపారు. వర్తమాన కాలంలో విజ్ఞానశాస్త్రం ప్రాధాన్యత పెరిగిందని వివరించారు. ప్రశ్నించే తత్వం నుండి సైన్స్ అభివృద్ధి చెందుతుందని అందుకే విద్యార్థులు ప్రశ్నించేతత్వం అలవరుచు కోవాలని సూచించారు. మానవ జీవన వికాసానికి సైన్స్ పరిశోధనలు దోహదం చేస్తాయని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
డిగ్రీ కళాశాలలో ఘనంగా సైన్స్ దినోత్సవ వేడుకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



